ఏలూరు: ఇండో-పాక్ యుద్ధ వాతావరణంలో పోలీసులు ఏలూరు నగరం మరియు జిల్లాలో విస్తృత తనిఖీలు శుక్రవారం చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జాతీయ రహదారుల్లో వాహన తనిఖీలు ముమ్మరంగా జరిగాయి. డాగ్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేసి అనుమానాస్పద వాహనాలను సీజ్ చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఐజీ అశోక్ కుమార్ పర్యవేక్షించారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.