టి. నర్సాపురం మండలం తెడ్లం గ్రామ శివారులో బుధవారం ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్వల్ప గాయాలతో వారంతా బయటపడ్డారు. స్కూలు బస్సు కామవరపుకోటకి చెందిన స్కూల్ కు చెందిన బస్సుగా గుర్తించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది.