తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును ఈ నెల 30లోపు చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇస్తామని కమిషనర్ ఏ. శామ్యూల్ బుధవారం తెలిపారు. పన్నుల చెల్లింపు కోసం పురపాలక కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆన్ లైన్ సచివాలయాల ద్వారా కూడా పన్నులు చెల్లించే అవకాశం ఉందన్నారు. గడువులోపు ఇంటి పన్నులు చెల్లించి రాయితీ పొందాలన్నారు.