కాళ్లు కడుక్కునేందుకు వెళ్లిన బాలుడు కాలు జారి ఏలూరు కాల్వలో గల్లంతైన ఘటన ఆదివారం తాడేపల్లిగూడెంలో జరిగింది. పడాలకు చెందిన వానపల్లి మణికంఠ గూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సైకిల్కు ప్యాచ్ పడడంతో వేయించేందుకు యాగర్లపల్లి వంతెన సమీపంలో సైకిల్ ఇచ్చి కాళ్లకు మట్టి అయిందని కాళ్లు కడుక్కునేందుకు కాల్వలోకి దిగి ప్రమాదవశాత్తు జారిపోయాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.