చింతలపూడి మండలం జార్జి పేట గ్రామానికి చెందిన గాదె కుమార్ రాజు (43) విద్యుత్ షాక్తో మంగళవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. చింతలపూడి మండలం తిమ్మిరెడ్డి పల్లి గ్రామానికి కుమార్ రాజు కూలి పనికి వెళ్లాడు. అక్కడ కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఆయన మృతి పట్ల మండల టీడీపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.