జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఉన్న రెడ్డిపేట ఫౌండేషన్ హైస్కూల్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీతో కలిసి ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులతో ఈ హెచ్ఎం మాకొద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేపట్టారు. హెచ్ఎం సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే స్కూల్కు విద్యార్థులను పంపమని తెలిపారు. హెచ్ఎం మత బోధన చేస్తూ హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారనే ఆరోపణలతో ఆందోళన చేపట్టారు.