రహదారి భద్రతా ప్రచారంలో భాగంగా మంగళవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ. డ్రైవింగ్ చేయరాదు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.