పెంటపాడు: దాతల సహకారం మరువలేనిది

80చూసినవారు
పెంటపాడు: దాతల సహకారం మరువలేనిది
పెంటపాడు మండలం ప్రత్తిపాడులో గురువారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో గోయింకా ఫుడ్ ఫ్యాక్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం సౌజన్యంతో రూ. 13 లక్షల వ్యయంతో రెండు ఆర్. ఓ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం రూ. 10 లక్షలతో జువ్వలపాలెం గ్రామం నందు స్మశాన వాటికను అభివృద్ధి చేసి గ్రామస్తులకు అప్పగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దాతల సహకారం మరువలేనిదని అన్నారు.

సంబంధిత పోస్ట్