పెంటపాడు మండలం అలంపురంకి చెందిన శ్రవణం మధులత విద్యను కొనసాగించాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతోంది. కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఆమె ఎదుర్కొంటోంది. ఇంటర్ లో 973 మార్కులు సాధించిన మధులత వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో చేరాలన్న తపనతో ఎదురుచూస్తున్న సమయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో రూ. 25,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆమెకు అండగా ఉంటానన్నారు.