ప్రజలు పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని జగన్నాధపురం సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం ఎస్. డబ్ల్యూ. ఎం షెడ్ వద్ద తడి, పొడి చెత్త సేకరణ, చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ తయారీపై పారిశుద్ధ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దరి చేరవన్నారు. ఈవోఆర్డీ వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు.