తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి ప్రాంతంలో ఆదివారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఒక మహిళను అదుపులోకి తీసుకొని ఆమె వద్ద నుంచి 15 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఈ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. ఎస్ఐలు దొరబాబు, మురళీమోహన్, సిబ్బంది ఉన్నారు.