నల్లజర్ల మండలం, ప్రకాశరావుపాలెంలోని వైజ్ ఇంజినీరింగ్ కాలేజ్ స్వయం ప్రతిపత్తి (అటానమస్) లభించిందని కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సంధ్యాల కృష్ణమూర్తి, ఆకుల త్రిమూర్తిలు తెలిపారు. గురువారం వైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పాలకవర్గం సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు నంధ్యాల కృష్ణమూర్తి, ఆకుల త్రిమూర్తిలు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. అరవింద్ కుమార్ పాలకవర్గ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.