అత్తిలి మండలం ఎంపీపీ స్థానం కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడం ఇక లాంఛనమే అని తణుకుఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీనుంచి ముగ్గురుఎంపీటీసీ సభ్యులు కూటమిలో చేరారు. ఈ మేరకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 19న ఎంపీపీ ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు కూటమిలో చేరినట్లు చెప్పారు.