అత్తిలి మండలం మంచిలి గ్రామంలో ప్రసిద్ధ క్షేత్రంగా పేరు గాంచిన అలివేలు, పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం స్వామి, అమ్మవార్లకు పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పూజలు అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. మంచిలి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు.