జూన్ 4న అనగా మంగళవారం ఓట్ల లెక్కింపు కోసం అటు ప్రజలు, నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తణుకు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్తిలి మండలం నుంచి ప్రారంభం కానుంది. మొదట తిరపతిపురం పోలింగ్ కేంద్రం ఈవీఎంను ఓపెన్ చేస్తారు. అనంతరం అత్తిలి, తణుకు టౌన్, తణుకు, ఇరగవరం మండలాల పరిధిలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. చివరిగా ఇరగవరం మండలంలోని ఏలేటిపాడు పంచాయతీ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది.