కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు శనివారం తణుకు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ధాన్యం రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. జిల్లాలో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే 6లక్షల టన్నులు మాత్రమే కొంటామని ఓటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.