కొద్ది రోజులుగా నిడమర్రు మండలంలో విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో చల్లబడిన వాతావరణంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్లు, పల్లపు ప్రాంతాలు జలమయమై, వాహనదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు.