అనుమానాస్పద స్థితిలో భార్యాభర్త మృతి

74చూసినవారు
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం. తణుకు మండలం పిట్లవరం గ్రామానికి చెందిన వారు ఏడేళ్లుగా వెంకటాపురంలో నివాసం ఉంటున్నారు. కాగా భార్యను పీక నులిమి, భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి జంగారెడ్డిగూడెం డి. ఎస్. పి రవిచంద్ర చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్