పండ్ల వర్తకులకు అండగా ఉంటాను

83చూసినవారు
తణుకు పట్టణంలో పండ్ల వర్తకులకు అండగా ఉంటానని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. బుధవారం తణుకులోని సంత మార్కెట్ వద్ద పండ్ల వర్తకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి రాగానే పండ్ల వర్తకులకు 50 షాపులు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్