తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ సొంత డబ్బులతో వైద్యం చేసుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా, నియోజకవర్గంలో గల 11 మందికి 6,88,153 రూపాయలు విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.