ఆపరేషన్ సింధూర్ నినాదంతో పాక్తో యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్కు తణుకులో కారుమూరి వెంకట నాగేశ్వరరావు నివాళులర్పించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కారుమూరి, మురళి నాయక్ మృతి భారతీయులను కలచివేసిందని, ఆయన కుటుంబానికి దేశం అండగా నిలబడాలని అన్నారు.