వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా ఆ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ కైంకర్యాలను జరిపించారు. అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.