తణుకు ఉండ్రాజవరం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది ఒక వ్యక్తి మృతి చెందిన బాధితున్ని గమనించి అటుగా వెళుతున్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తక్షణమే స్పందించి పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, అంబులెన్స్ వచ్చేవరకు అక్కడే ఉండి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే పర్యవేక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు.