ఏపీ పాలీసెట్ ఫలితాల్లో తణుకు పట్టణానికి చెందిన యశ్వంత్ పవన్ సాయిరాం 120 మార్కులకు గాను 120 సాధించి రాష్ట్రస్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. తణుకు లోని రూట్స్ స్కూల్ లో చదువుతున్న సాయిరాం ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా స్కూలు డైరెక్టర్లు ఎల్ కే త్రిపాఠి, విద్యా కాంత్, సుధాకర్ వర్మ తదితరులు సాయిరాంను బుధవారం అభినందించారు.