వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీ యువజన విభాగంలో కీలకంగా వ్యవహరించిన యాతం చంద్రశేఖర్ బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొనేందుకు తణుకు విచ్చేసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో చంద్రశేఖర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ టిడిపిలో చేరారు.