ఆకివీడులో తాహసీల్దార్ వెంకటేశ్వరరావుకు పాత్రికేయులు గురువారం వినతిపత్రం అందజేశారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా చోరబడి సోదాలు నిర్వహించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు విఘాతం అని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు.