ఉండి మండలం మహాదేవపట్నంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మధుర (7) పాము కాటుకు గురైంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు పాపను భీమవరంలోని రాజర్షి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన కాసేపటికి మెరుగైన వైద్యం కోసం మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పాప చనిపోయిందని తెలిపారు. దీంతో బంధువులు రాజర్షి ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు.