పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి. నాగరాణిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు.