ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కోశాధికారి, ఎపిఎస్ఆర్టీసీ పశ్చిమ గోదావరి రీజినల్ ఆఫీసు ఏలూరులో విధులు నిర్వహిస్తున్న రావి రవికుమార్ (45) ఏలూరులో తన నివాసంలో ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. రవికుమార్ భౌతికకాయాన్ని 13 వ తేదీ ఉదయం తన స్వగ్రామం చిట్టవరం తరలించారు. 14 వ తేదీ శనివారం నరసాపురం దగ్గరలోని చిట్టవరంలో అంతిమ క్రియలు జరుపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.