ఉండి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న పదిమందిని శుక్రవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నసీరుల్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.