అన్నేవారిగూడెం ఎంపీపీ యూపీ పాఠశాలలో గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మస్తాన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఇతర ప్రాంతాల్లో విద్యాభ్యాసానికి వెళ్లే విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యను నేర్చుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. భీమడోలు నెంబర్ 4 ఎంపీపీ ప్రాథమిక పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు అంతర్రాష్ట్ర పర్యటనకు ఎంపికైనట్లు మండల విద్యాధికారులు భాస్కర కుమార్, శ్రీనివాసరావు తెలిపారు.