భీమడోలు, గుండుగొలను, ఆగడాలలంక, అంబరుపేటలోని 33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలో చెట్ల కొమ్మలు నరికివేత, మరమ్మతుల నేపథ్యంలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేడ్కర్ తెలిపారు. ఉదయం 8. 30 నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.