సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉంగుటూరు ఎన్టీఆర్ విగ్రహం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు 500 మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు టీడీపీ మండల అధ్యక్షుడు వేములపల్లి తెలిపారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.