నిడమర్రు మండలానికి చెందిన కల్లు గీత కార్మికుల మద్యం షాపుల కేటాయింపు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 8వరకు పొడిగించారని భీమడోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ బుధవారం తెలిపారు. గడువు లోగా ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు భీమడోలు ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.