నిడమర్రు గ్రామ అభివృద్ధిలో తాను భాగస్వాములై తన వంతు ఆర్థిక సహాయం చేయడానికి ఎన్నారై ముందుకొచ్చారు. ఎన్నారై నిడమర్తి ఉదయ భాస్కర్ బుధవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో తెలిపారు. సిసి రోడ్లు, డ్రైనేజి, త్రాగునీరు సదుపాయలను కల్పించటం కోసం ఆర్థిక సాయం చేస్తానన్నారు. గ్రామ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన ఎన్నారై ను ఎమ్మెల్యే అభినందించారు.