ఉంగుటూరు అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శుక్రవారం పూజా కార్యక్రమం నిర్వహించారు. పహల్గమ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిగా, భారత సైనికులకు పాక్ ముష్కరులను మట్టుపెట్టే శక్తి, మనోధైర్యం ప్రసాదించాలని, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అడపా శోభారాణి మరియు మహిళలు పాల్గొన్నారు.