కొల్లేరులో మూడవ కాంటూరు కుదించాలని సిపిఎం నాయకులు గురువారం ఉంగుటూరులో ఎమ్మెల్యే ధర్మరాజుకు వినతిపత్రం అందజేశారు.
పర్యటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని, రెగ్యులర్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు, జీవి కృష్ణారావు, పార్టీ నియోజకవర్గ నాయకులు నారపల్లి రమణారావు, పచ్చిపులుసు గోవిందు, కోన శ్రీనివాసరావు, గవర సత్యనారాయణ, ఎస్ అప్పారావు పాల్గొన్నారు.