ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామంలో పశువులకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులతో త్రాగునీటి తోట్టెలను నిర్మించారు. శుక్రవారం ఈ తొట్టిలను గ్రామ సర్పంచి పసుపులేటి నరసింహారావు పరిశీలించారు. ఉంగుటూరు, చేబ్రోలు, తదితర గ్రామాలలో పశువులకు తాగునీటి తొట్టిలు పూర్తయ్యని ఉంగుటూరు ఎంపీడీవో గంజి రాజు మనోజ్ తెలిపారు.