కురెళ్ళగూడెం వద్ద యూ టర్న్ తీసుకుంటున్న కంటైనర్ ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. భీమడోలు మండలం కుర్రెళ్ళగూడెంలో శుక్రవారం రొయ్యల లోడ్ చేసుకొని కంటైనర్ తాడేపల్లిగూడెం వైపు వెళ్ళేందుకు బయలుదేరింది. కురెళ్ళగూడెం యూ టర్న్ తీసుకుంటుండగా 12 చక్రాల లారీపై ఉన్న కంటైనర్ ఊడిపోయి రోడ్డుమీదకి ఒరిగిపోయింది. అయితే ఈ దుర్ఘటనలో ఎవరికి ఏమి కాలేదని హైవే పెట్రోలింగ్ పోలీసులు వెల్లడించారు.