మండల కేంద్రమైన భీమడోలు శాఖ గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం సామూహిక పుస్తక పఠనం, నీతి కథలు చెప్పడం వంటి కార్యక్రమాలు జరిగాయి. వాటితో పాటు చిన్నారులు శారీర ఉల్లాసాన్ని కలిగించే ఆటపాటల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చక్కగా పద్యాలును ఆలపిస్తున్నారు. ఊపిరితిత్తులకు సామర్థ్యాన్ని గుర్తించే ఆటను ఆడారు.