ఉంగుటూరు తాహశీల్దార్ కార్యాలయం నుండి రాజులు కాలనీ వరకు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కృషితో పుంత రోడ్డుకు మహర్దశ పట్టబోతుంది. ఉపాధి హామీ పథకం నిధులు ఒక కోటి ఆరు లక్షలతో ఈ రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డు వలన రెండు గ్రామాలకు రాకపోకలకు ఎంతకు అనువుగా ఉంటుంది. పండించిన పంటను రవాణా చేయటానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని రైతులు శనివారం తెలిపారు.