వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గత కొన్ని రోజులుగా విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. మామిడి రైతుల గురించి ఏం తెలుసని జగన్ చిత్తూరు జిల్లాకు వస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. తిరుపతి ఎమ్ఆర్పల్లె కూడలిలో నిర్వహించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్యామ్ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.