అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM-KISAN పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.