ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. ఇక తర్వాత జరిగే సిరీస్పై అందరి కళ్లూ పడ్డాయి. టీమిండియా తన తదుపరి సిరీస్లను సొంత గడ్డపై ఆడనుంది. కీలక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం భారత పర్యటనకు రానుంది. ఈ ఐదు టీ20ల సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కోల్కతా, రెండో టీ20 చెన్నై, మూడో టీ20 రాజ్కోట్, నాలుగో టీ20 పుణే, ఐదో టీ20 FEB 2న ముంబై వేదికగా జరుగుతుంది.