AP: విశాఖ మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమయింది. ఏప్రిల్ 19న విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైసీపీ.. విశాఖలోని 58 మంది కార్పొరేటర్లు, ముగ్గురు సభ్యులకు విప్ జారీ చేసింది. వైసీపీ బీఫామ్తో గెలిచినవారికి మాత్రమే విప్ వర్తిస్తుందని పార్టీ అధిష్టానం వెల్లడించింది. సభ్యులు పార్టీ ఆదేశాలను పాటించాలని సూచించింది.