AP: సీఎం చంద్రబాబుతో వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘విన్ ఫాస్ట్’ సీఈవో ఫామ్ సాన్ చౌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని సాన్ చౌను చంద్రబాబు కోరారు. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన భూమి ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలను విన్ ఫాస్ట్ కంపెనీ తయారు చేస్తోంది.