ఏపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలూరు పట్టణం రామచంద్రరావు పేటలో ఉన్న సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటున్న మహిళ మృత్యువాత పడింది. గతంలో ఆమెకు పేస్ మేకర్ హార్ట్ను వైద్యులు అమర్చారు. అయితే, మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేయకుండా ఇవాళ ఆమెను స్కానింగ్కి పంపడంతో కొట్టుమిట్టాడుతూ మరణించింది. ఎమ్ఆర్ఐ స్కాన్ రేడియేషన్తో అది ఊడిపోయి మరణించిందని ప్రాథమికంగా నిర్ధారించారు.