యశస్వి జైస్వాల్ మరో రికార్డ్ సాధించాడు. పెర్త్ టెస్టులో సెంచరీతోపాటు ఐదు టెస్టుల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేశాడు. భారత్ తరపున టాప్ స్కోరర్ కాగా.. ట్రావిస్ హెడ్ (414*) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో తొలి సిరీస్లోనే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (1977/78 సీజన్) 450 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ (2003/04) 464 పరుగులు, మురళీ విజయ్ (2014/15) 482 పరుగులు సాధించారు.