ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరో వైసీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న పాలమడుగు దుర్గాప్రసాద్ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్తో పాటు పలువురు వైసీపీ నేతలు దాడికి వెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే టీడీపీ కేసు పెట్టినా విచారణ వేగంగా జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.