AP: వైసీపీపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు తిరుమల వాతావరణాన్ని కలుషితం చేయడానికి కంకణం కట్టుకున్నారని, టీటీడీ పాలక వర్గాన్ని అవమానిస్తూ దూషించడమే వారు పనిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడం మానేసి బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.